Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనుషుల ప్రాణాలు హరిస్తున్న వైఎస్. జగన్ వాహన శ్రేణి!!

ఠాగూర్
బుధవారం, 18 జూన్ 2025 (18:42 IST)
వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనల్లో విషాదకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా, జగన్ కాన్వాయ్‌లోని వాహనాలు ఢీకొని పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. బుధవారం ఆయన పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటన సందర్భంగా రెండు విషాదకర ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. 
 
బుధవారం ఉదయం జగన్ కాన్వాయ్‌లోని ఓ వాహనం ఏటుకూరు బైపాస్ వద్ద సింగయ్య అనే వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 
 
మరో ఘటనలో సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద జగన్ రాక సందర్భంగా ఏర్పడిన జనసందోహం, తోపులాటలో వైకాపా కార్యకర్త జయవర్ధన్ రెడ్డి ఊపిరాడక సొమ్ముసిల్లిపడిపోయాడు. ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాలు ఉన్నాయని ఎన్టీఆర్ నిరూపించారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments