Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో పార్టీ పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా? వైఎస్ షర్మిల

Webdunia
సోమవారం, 3 జనవరి 2022 (14:05 IST)
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తన పార్టీని స్థాపించే దిశగా ఆమె అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఆమె స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ పెట్టకూడదని రూల్ ఏం లేదు కదా అని ప్రశ్నించారు. 
 
ఆమె సోమవారం ఆ మీడియా ప్రతినిధితో పిచ్చాపాటిగా మాట్లాడుతూ, ఒక రాజకీయ పార్టీని దేశంలో ఎక్కడైనా పెట్టొచ్చన్నారు. పైగా, తమంటూ ఒక విధానం, మార్గం ఉందన్నారు. అందువల్ల ఆ మార్గంలోనే తాము ప్రయాణిస్తున్నామని చెప్పారు. 
 
ఇదిలావుంటే, ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం పొసగడం లేదని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, క్రిస్మస్ పండుగ రోజున తమ తండ్రి వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా వీరిద్దరూ గొడవపడినట్టు మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. 
 
ముఖ్యంగా, ఆస్తుల పంపకాల విషయంలో తల్లి విజయమ్మ సమక్షంలోనే వారిద్దరూ గొడవపడినట్టు సమాచారం. ఆ తర్వాత అర్థరాత్రి సమయంలో తన తల్లి విజయమ్మతో కలిసి ఇడుపులపాయ నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయారటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు సంచలనంగా మారాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments