వరద బాధితులకు సీఎం జగన్ శుభవార్త : దెబ్బతిన్న ఇళ్లకు...

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (17:26 IST)
ఏపీలోని వరద బాధితులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్న గృహాల స్థానంలో కొత్త ఇళ్లను నిర్మించనున్నట్టు తెలిపారు. వరద బాధితులకు ప్రభుత్వం ఇస్తున్న సాయం పూర్తిగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. 
 
రాష్ట్రంలోని వరద బాధిత జిల్లాల్లో సాగుతున్న సహాయక చర్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులోభాగంగా, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లా కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపణీతో పాటు బాధిత కుటుంబాలకు రూ.2 వేలు అదనంగా చెల్లించాలని కోరారు.
 
అలాగే, వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో తాగునీటితో పాటు.. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేలా తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. ఈ వరదల్లో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments