Webdunia - Bharat's app for daily news and videos

Install App

డీజీపీని టీడీపీ నేతలు అన్నా, మామా అంటూ పిలుస్తారు!: జగన్

Webdunia
సోమవారం, 4 మే 2015 (14:35 IST)
ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాముడుపై వైకాపా అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ నేతలతో సత్సంబంధాలను కలిగి ఉన్న డీజీపీ... ఆ పార్టీ నేతలు చేస్తున్న అరాచకాలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. ఆయన సొంత జిల్లా అనంతపురంలోనే హత్యలు జరుగుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 
 
డీజీపీని టీడీపీ నేతలు... అన్నా, మామా అంటూ పిలుస్తారని అన్నారు. ప్రసాద్ రెడ్డి హత్య విషయంలో స్థానిక ఎస్ఐని వీఆర్‌కు వేస్తే, మరుసటి రోజే తిరిగి పోస్టింగ్ ఇచ్చారని మండిపడ్డారు. రెండు నెలల్లో రిటైర్ కావాల్సిన డీజీపీ రాముడుకి రెండేళ్ల సర్వీస్ పొడిగించారని విమర్శించారు.
 
ఏపీలో రాజకీయ హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌తో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన పార్టీ నేత ప్రసాద్ రెడ్డి హత్యను ఆయన ప్రస్తావించారు. వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు సర్కారు యత్నిస్తోందని ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న అధికారపక్షాన్ని నిలువరించాలని ఆయన గవర్నర్ కోరారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments