జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు - భయంతోనేనా...

ఠాగూర్
శుక్రవారం, 27 సెప్టెంబరు 2024 (15:02 IST)
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన చివరి నిమిషంలో రద్దు అయింది. గత వైకాపా ప్రభుత్వంలో శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తున్న సమయంలో ఆయన ఈ నెల 27, 28వ తేదీల్లో తిరుమల పర్యటనకు వెళ్లాలని భావించారు. ఇందుకోసం శుక్రవారం రాత్రి తిరుపతికి చేరుకుని, అక్కడ నుంచి అలిపిరి మెట్ల మార్గంలో కాని నడకన తిరుమలకు చేరుకుని, 28వ తేదీ శనివారం శ్రీవారిని దర్శనం చేసుకోవాలని భావించారు. కానీ, ఆయన పర్యటన చివరి నిమిషంలో అనూహ్యంగా రద్దు అయింది. 
 
గతంలో మాదిరిగా జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమల ఆలయంలో అడుగుపెట్టకూడదని కూటమి పార్టీలు ఇతర హిందూ ధార్మిక సంస్థలు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేశాయి. ఈ పరిస్థితుల్లో ఆయన తిరుమల పర్యటన చేపడితే పరిస్థితి మరింతగా దిగజారుతుందని భావించారు. అందుకే తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. 
 
మరోవైపు, జగన్ తిరుమల పర్యటనను అడ్డుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పోలీసు వర్గాలు కూడా హెచ్చరించాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని జగన్ తిరుమల పర్యటన సాఫీగా సాగేనా అనుమానాలు కలిగాయి. ఈ క్రమంలో జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన పర్యటన రద్దుకు గల కారణాలను ఆయన మీడియా ముందుకు వచ్చి వివరించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments