Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్మోహన్ రెడ్డికి అరుదైన గౌరవం.. శిలాఫలకంపై ఆ ముగ్గురు పేర్లు

Webdunia
బుధవారం, 19 జూన్ 2019 (20:11 IST)
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కనుంది. తెలంగాణలో జరిగే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో శిలాఫలకంపై తన పేరును లిఖించుకోనున్నారు.


ఈ నెల 21న తెలంగాణ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కాళేశ్వరం ప్రారంభోత్సవానికి రావాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా అమ‌రావ‌తికి వ‌చ్చి జ‌గ‌న్‌ను ఆహ్వానించారు.
 
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కూడా ఆహ్వానించారు. వీరిద్దరి రాకకు గుర్తుగా వారికి గౌర‌వం ఇస్తూ ప్రాజెక్టు ప్రారంభోత్సవ శిలా ఫ‌ల‌కంపై ఆ ఇద్దరి సీఎంల పేర్లు చెక్కించనున్నారు. శిలాఫ‌ల‌కం మీద ముందుగా గవర్నర్ న‌ర‌సింహ‌న్ పేరు, త‌రువాత కేసీఆర్, ఆ త‌ర్వాత ఈ ఇద్దరు సీఎంల పేర్లు ఉండనున్నాయి.
 
గ‌తంలో ఏపీలో కేసీఆర్‌కు కూడా ఇదే ర‌కంగా జరిగింది. అక్టోబ‌ర్ 21, 2015న ఏపీ నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తికి శంకుస్థాప‌న జ‌రిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు గవర్నర్ నరసింహన్, సింగ‌పూర్ మంత్రులు, వివిధ దేశాలకు చెందిన ప్రజాప్రతినిధులు హాజ‌ర‌య్యారు. 
 
ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్వయంగా సీఎం కేసీఆర్ ఇంటికి వచ్చి ఆ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. ఇప్పుడు అదే విధంగా జ‌గ‌న్‌కు తెలంగాణ సర్కారు ప్రాధాన్యం ఇస్తోంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments