Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివరాత్రి వేడుకల్లో అపశృతి - గోదావరిలో స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతు!

ఠాగూర్
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (11:09 IST)
మహాశివరాత్రి పర్వదినం రోజున తూర్పు గోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శివరాత్రిని పురస్కరించుకుని గోదావరి నదిలోకి స్నానానికి వెళ్లిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ విషాదకర ఘటన జిల్లాలోని తాళ్లపూడి మండలంలో సంభవించింది. తాడిపూడిలో గోదావరి స్నానానికి దిగిన ఐదుగురు యవకులు గల్లంతయ్యారు. సమాచారం. అందడంతో పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని, గజ ఈతగాళ్ల సాయంతో యువకులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక యువకుడు మృతదేహం లభ్యమైంది. మిగిలిన మృతదేహాల కోసం గాలిస్తున్నారు. 
 
సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. పది మంది మృత్యువాత 
 
దక్షిణ సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మిలటరీ విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఖార్జూమ్ సమీపంలోని వాది సీద్నా ఎయిర్ బేస్ నుంచి మంగళవారం రాత్రి ఆర్మీ ఫ్లైట్ బయలుదేరేందుకు సిద్ధమైంది. ఈ విమానం రన్‌వేపై పరుగులు పెట్టి టేకాఫ్ అవుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది మృతి చెందారు. వీరిలో ఆర్మీ అధికారులు, సాధారణ పౌరులు కూడా ఉన్నారు. అలాగే, పలువురికి గాయాల్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విమానానికి మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టింది. కాగా, టేకాఫ్‌లో సమస్యలు కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే, ఈ ప్రమాదంలో కనీసం 20 మంది వరకు చనిపోయినట్టు అనధికారిక వర్గాల సమాచారం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం