Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివరాత్రి వేడుకల్లో అపశృతి - గోదావరిలో స్నానానికి వెళ్లి ఐదుగురు గల్లంతు!

ఠాగూర్
బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (11:09 IST)
మహాశివరాత్రి పర్వదినం రోజున తూర్పు గోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. శివరాత్రిని పురస్కరించుకుని గోదావరి నదిలోకి స్నానానికి వెళ్లిన ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ఈ విషాదకర ఘటన జిల్లాలోని తాళ్లపూడి మండలంలో సంభవించింది. తాడిపూడిలో గోదావరి స్నానానికి దిగిన ఐదుగురు యవకులు గల్లంతయ్యారు. సమాచారం. అందడంతో పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకుని, గజ ఈతగాళ్ల సాయంతో యువకులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఒక యువకుడు మృతదేహం లభ్యమైంది. మిగిలిన మృతదేహాల కోసం గాలిస్తున్నారు. 
 
సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. పది మంది మృత్యువాత 
 
దక్షిణ సూడాన్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. మిలటరీ విమానం ఒకటి కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. ఖార్జూమ్ సమీపంలోని వాది సీద్నా ఎయిర్ బేస్ నుంచి మంగళవారం రాత్రి ఆర్మీ ఫ్లైట్ బయలుదేరేందుకు సిద్ధమైంది. ఈ విమానం రన్‌వేపై పరుగులు పెట్టి టేకాఫ్ అవుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది మృతి చెందారు. వీరిలో ఆర్మీ అధికారులు, సాధారణ పౌరులు కూడా ఉన్నారు. అలాగే, పలువురికి గాయాల్యాయి. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విమానానికి మంటలు వ్యాపించడంతో అగ్నిమాపక సిబ్బంది చర్యలు చేపట్టింది. కాగా, టేకాఫ్‌లో సమస్యలు కారణంగానే ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అయితే, ఈ ప్రమాదంలో కనీసం 20 మంది వరకు చనిపోయినట్టు అనధికారిక వర్గాల సమాచారం. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

క్రంచిరోల్, సోనీ పిక్చర్స్ డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా.. తెలుగులో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం