Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలిసినోడే కదా అని బైకెక్కితే... మార్గమధ్యంలో కిందపడేసి ఆ పని చేశాడు...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (13:10 IST)
కరీంనగర్ జిల్లాలో ఓ మహిళ అత్యాచారానికి గురైంది. తెలిసినోడే కదా అని బైకు ఎక్కినందుకు ఆ మహిళ రేప్‌కు గురైంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొరటపల్లి అనే గ్రామానికి చెందిన ఓ మహిళ... తన వ్యక్తిగత పనుల నిమిత్తం జిల్లా కేంద్రానికి వచ్చింది. 
 
అక్కడ తన పని ముగించుకుని తిరుగు ప్రయాణమైంది. ఇంతలో తమ గ్రామానికే చెందిన మేకల సురేష్ అనే యువకుడు బైకుపై కనిపించడంతో పలుకరించింది. ఆ తర్వాత అతనితో కలిసి ఇంటికి వెళ్లేందుకు బైకు ఎక్కింది. కొంతదూరం వెళ్లాక ఆ వ్యక్తి తనలోని వక్రబుద్ధిని బయటపెట్టాడు. 
 
బైకును ఆపి.. ఆ మహిళను బలవంతంగా కిందపడేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. అక్కడ నుంచి ఇంటికి చేరుకున్న బాధిత మహిళ.. జరిగిన విషయం కుటుంబ సభ్యులకు చెప్పి.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. యువకుడిపై అత్యాచారం కేసు నమోదు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments