Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లింటి లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు

Webdunia
బుధవారం, 5 జులై 2023 (09:03 IST)
కోనసీమ జిల్లాలో ఓ విషాదకర ఘటన జరిగింది. కుటుంబానికి చేదోడుగా ఉంటూ త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడిని లారీ రూపంలో మృత్యువు కబళించింది. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరు - అత్తిలి రాష్ట్ర రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కోనసీమ జిల్లాకు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. 
 
ఈ ప్రమాద వార్త వివరాలను పరిశీలిస్తే, కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడికి చెందిన పోతంశెట్టి వెంకట బసివిరెడ్డి(23) ద్విచక్ర వాహనంపై బ్రాహ్మణ చెరువు వైపు వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఫైనాన్స్‌ వ్యాపారం చేసే బసివిరెడ్డి గ్రామాల్లో డబ్బులు ఇచ్చి వసూలు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఉదయం వసూళ్లకు వెళ్తుండగా ఆలమూరు శివారు భగ్గేశ్వరం డ్రెయిన్‌ వంతెన సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొని కొంత దూరం ఈడ్చుకుపోయింది. తలకు గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై కన్నుమూశాడు.
 
నెల రోజుల కిందటే బసివిరెడ్డికి నిశ్చితార్థమైంది. సెప్టెంబరు నెలలో వివాహం చేసేందుకు ముహూర్తం నిశ్చియించుకున్నారు. పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో వ్యాపార లావాదేవీల నిమిత్తం గ్రామాంతరం వెళ్లిన కుమారుడు తిరిగి రాని లోకాలకు చేరడంతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments