Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరొకరితో సన్నిహితంగా ఉన్నదనీ.. మరదలిని హత్య చేసిన బావ!

Webdunia
మంగళవారం, 5 ఏప్రియల్ 2016 (09:59 IST)
చిత్తూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. తన మరదలు వేరొకరితో సన్నిహితంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని బావ.. కిరాతకుడిగా మారిపోయి మరదలిని అతి దారుణంగా హత్య చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తంబళ్లపల్లె మండలం ఇట్నేనివారిపల్లిలోని టేకు మంద పాపన్న, రమణమ్మ కుమార్తె సుశీల అనే యువతి స్థానికంగా ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతోంది. రమణమ్మకు వరుసకు అన్న అయిన రమణ కుమారుడు సురేష్‌ డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నాడు. 
 
సురేష్‌, సుశీలకు మధ్య గత కొన్నినెలలుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే రెండు నెలలకు ముందు ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే సుశీల తన స్నేహితుడితో గత కొన్నిరోజులుగా సన్నిహితంగా మెలుగుతూ వస్తోంది. 
 
దీన్ని జీర్ణించుకోలేని సురేష్‌ సుశీలను ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి దారుణంగా బండరాయితో కొట్టి, చున్నీతో మెడకు బిగించి హత్య చేసి పారిపోయాడు. దీనిపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments