Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో కుప్పకూలిపోయిన యువకుడు.. ఆ తర్వాత?

సెల్వి
బుధవారం, 20 ఆగస్టు 2025 (10:05 IST)
ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం నాయుడుపేట గ్రామానికి చెందిన గండ్రేటి సాయి కిరణ్ అనే 20 ఏళ్ల యువకుడు మంగళవారం కాకినాడలో జరిగిన ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో పాల్గొంటూ మరణించాడు. 
 
వివరాల్లోకి వెళితే.. 1,600 మీటర్ల పరుగు తర్వాత శ్వాసకోశ సమస్యల కారణంగా సాయి కిరణ్ కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని అంబులెన్స్‌లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడినట్లు సమాచారం. సాయంత్రం తరువాత మరణించినట్లు పోలీసులు తెలిపారు. 
 
రైతు అప్పల నాయుడు, భారతి దంపతుల కుమారుడు అయిన సాయి కిరణ్ ఇటీవల డిగ్రీ పరీక్షలలో అర్హత సాధించి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్మీ ర్యాలీలో తమ కుమారుడు మరణించడం పట్ల రోదిస్తున్నారు. ర్యాలీలో కుప్పకూలిన తమ కొడుకుకు సరైన వైద్యం అందలేదని, అందుకే అతను మరణించాడని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

నేటి ట్రెండ్ కు తగ్గట్టు కంటెంట్ సినిమాలు రావాలి : డా: రాజేంద్ర ప్రసాద్

దుబాయిలో వైభవ్ జ్యువెలర్స్ ప్రెజెంట్స్ Keinfra Properties గామా అవార్డ్స్

నేచురల్ స్టార్ నాని చిత్రం ది ప్యారడైజ్ కోసం హాలీవుడ్ కొలాబరేషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments