Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాలో పేరెంట్స్‌ను ఆదుకుందామని స్వీట్స్ షాపులో చేరిన యువతి: మత్తు మందిచ్చి అత్యాచారం

Webdunia
బుధవారం, 19 మే 2021 (13:18 IST)
గుంటూరు జిల్లా పొన్నూరులో దారుణం జరిగింది. కరోనావైరస్ దెబ్బకు తన తల్లిదండ్రులకు ఆర్థికంగా ఆసరాగా నిలుద్దామని స్వీట్స్ దుకాణంలో చేరిన యువతిపై యజమాని అత్యాచారానికి ఒడిగట్టాడు.
 
వివరాలు చూస్తే... గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన యువతి ఇంజినీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కరోనావైరస్ విజృంభణ కారణంగా కాలేజీ మూసేసారు. దీనితో ఇంటివద్దనే వుంటున్న ఆ యువతి, తన తల్లిదండ్రులకు ఆర్థికంగా ఆసరా ఇవ్వాలనుకుని పట్టణంలోని ఓ స్వీట్ షాపులో నెలకి రూ.5వేల జీతానికి పనిలో చేరింది.
 
ఐతే ఆ షాపు యజమాని ఈ యువతిపై కన్నేశాడు. అదనుకోసం చూసిన ఆ కామాంధుడు షాపులో ఎవరూ లేని సమయంలో ఆ యువతికి మత్తుమందు కలిపిన కూల్ డ్రింకును ఇచ్చాడు. అది తాగిన ఆమె కొద్దిసేపటికే మత్తులోకి జారుకుంది. దాంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మత్తు నుంచి బయటపడ్డ యువతి తనపై జరిగిన లైంగిక దాడిని గుర్తించి, విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. పొన్నూరు అర్బన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసారు బాధితులు.
 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం