Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సుల్లో వైఫై సేవలు... గంట పాటు ఫ్రీ, ఆ పై రూ. 10..!

Webdunia
శనివారం, 28 మార్చి 2015 (09:25 IST)
ప్రైవేటు రవాణా సంస్థల పోటీకి ధీటుగా ప్రభుత్వ రవాణా సంస్థ కూడా ఆర్టీసీ బస్సుల్లో అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది. ఆర్టీసీ ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ వైఫై సౌకర్యం కల్పించనుంది. ఈ 'వైఫై' సౌకర్యం ఏప్రిల్ 1 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో అందుబాటులోకి రానుంది. 
 
ఈ సౌకర్యం విజయవాడ నుంచి ప్రారంభమై, హైదరాబాదు, విశాఖపట్టణం, తిరుపతి, బెంగళూరు నగరాలకు రాకపోకలు సాగించే వెన్నెల, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో అందుబాటులో ఉంచనుంది. ఆ తర్వాత దీనిని నెమ్మదిగా విశాఖపట్టణం, గుంటూరు, తిరుపతి కేంద్రాలుగా నడిచే బస్సులకు విస్తరించాలని ఆర్టీసీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ అత్యాధునిక సౌకర్యం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకులు గంటపాటు వైఫై సేవలను ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటును ఆర్టీ కల్పిస్తోంది. తరువాత 10 రూపాయలు చెల్లిస్తే గమ్యం చేరేవరకు ఎంతసేపైనా వైఫై వినియోగించుకోవచ్చని ఆర్టీసీ తెలిపింది. 
 
ఆ ప్రకారం వైఫై కోసం బస్సులో ఓ కంప్యూటర్, వైఫై పరికరం అందుబాటులో ఉంటాయట. ఈ కంప్యూటర్ లో 50 సినిమాలు, 400 వీడియో పాటలు అందుబాటులో ఉంచుతారట. వీటిని వారివారి మొబైల్, ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్, ఐప్యాడ్ లలో వీక్షించుకోవచ్చని ఆర్టీసీ చెబుతోంది.

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments