Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిని వేధించిన కేసు.. తొలిసారిగా యువకుడికి 3 రోజుల జైలు.. గుడిలో హత్య?

యువతిని వేధించిన కేసులో తొలిసారిగా ఓ యువకుడికి మూడు రోజుల పాటు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డ నటరాజ్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ ఇనాయత్ యూసుఫ్‌గూడలో ఓ యువతిని ఈవ్‌ టీజింగ్‌ చేశాడు. సమాచార

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (10:00 IST)
యువతిని వేధించిన కేసులో తొలిసారిగా ఓ యువకుడికి మూడు రోజుల పాటు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. ఎర్రగడ్డ నటరాజ్‌నగర్‌కు చెందిన సయ్యద్‌ ఇనాయత్ యూసుఫ్‌గూడలో ఓ యువతిని ఈవ్‌ టీజింగ్‌ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని సెక్షన్‌ 70-సి కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. కేసును విచారించిన న్యాయమూర్తి నిందితుడికి మూడు రోజులు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. పిటీ కేసులో యువకుడికి జైలు శిక్ష విధించడం ఇదే తొలిసారి. 
 
ఇదిలా ఉంటే.. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో దారుణం జరిగింది. గుడిలోనే ఓ ప్రేమికుడిని ఓ యువతి బంధువులు హతమార్చారు. 24 ఏళ్ళ మహంకాళి అనిల్ అనే యువకుడిని నిర్దాక్షిణ్యంగా గొంతు కోశారు. వివరాల్లోకి వెళ్తే.. మౌనిక అనే యువతి‌తో అనిల్ ప్రేమలో పడ్డాడు. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు పెళ్ళి చేుసకోవాలని డిసైడయ్యారు. కానీ మౌనిక తల్లిదండ్రులు, బంధువులు గురువారం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి చేరుకున్న అనిల్‌ను హతమార్చి పారిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments