Webdunia - Bharat's app for daily news and videos

Install App

61 రోజులపాటు సముద్ర జలాల్లో చేపల వేటకు నిషేధం..ఏపీ మత్స్యశాఖ

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (11:23 IST)
ఈ నెల 15 వ తేదీ నుంచి జూన్‌ 14 వ తేదీ వరకు మొత్తం 61 రోజులపాటు దేశవ్యాప్తంగా సముద్ర జలాల్లో సముద్ర ఉత్పత్తుల వేటను పూర్తిగా నిషేధించనున్నారు. చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల వేటను నిషేధిస్తున్నట్లు ఏపీ మత్స్యశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత 2020-21 సీజన్‌ ఈనెల 15 వ తేదీతో ముగియనుంది.
 
మత్స్యశాఖ ఇన్‌ఛార్జి జెడి పి.లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఎపి మెరైన్‌ ఫిషింగ్‌ (రెగ్యులైజేషన్‌) చట్టం 1994 ప్రకారం.. నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నామన్నారు. మత్స్యరాశుల సమర్థ యాజమాన్య చర్యల్లో భాగంగా.. ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నామన్నారు. 
 
నిషేధ సమయంలో ఎవరైనా సముద్రంలో వేట సాగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, బోట్లు, మత్స్య ఉత్పత్తులను సైతం సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఈ నిషేధ ఆంక్షలను రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు పర్యవేక్షించనున్నారు. 
 
నిషేధిత సమయంలో చిరుచేపలు, రొయ్యల ఉత్పత్తి పెద్ద ఎత్తున జరగనుంది. 61 రోజులపాటు మత్స్యవేటను నిలిపివేస్తే తరువాత దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని మత్స్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments