Webdunia - Bharat's app for daily news and videos

Install App

61 రోజులపాటు సముద్ర జలాల్లో చేపల వేటకు నిషేధం..ఏపీ మత్స్యశాఖ

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (11:23 IST)
ఈ నెల 15 వ తేదీ నుంచి జూన్‌ 14 వ తేదీ వరకు మొత్తం 61 రోజులపాటు దేశవ్యాప్తంగా సముద్ర జలాల్లో సముద్ర ఉత్పత్తుల వేటను పూర్తిగా నిషేధించనున్నారు. చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర ఉత్పత్తుల వేటను నిషేధిస్తున్నట్లు ఏపీ మత్స్యశాఖ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత 2020-21 సీజన్‌ ఈనెల 15 వ తేదీతో ముగియనుంది.
 
మత్స్యశాఖ ఇన్‌ఛార్జి జెడి పి.లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఎపి మెరైన్‌ ఫిషింగ్‌ (రెగ్యులైజేషన్‌) చట్టం 1994 ప్రకారం.. నిషేధాజ్ఞలను అమలు చేస్తున్నామన్నారు. మత్స్యరాశుల సమర్థ యాజమాన్య చర్యల్లో భాగంగా.. ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నామన్నారు. 
 
నిషేధ సమయంలో ఎవరైనా సముద్రంలో వేట సాగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, బోట్లు, మత్స్య ఉత్పత్తులను సైతం సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. ఈ నిషేధ ఆంక్షలను రాష్ట్ర మత్స్యశాఖ అధికారులు పర్యవేక్షించనున్నారు. 
 
నిషేధిత సమయంలో చిరుచేపలు, రొయ్యల ఉత్పత్తి పెద్ద ఎత్తున జరగనుంది. 61 రోజులపాటు మత్స్యవేటను నిలిపివేస్తే తరువాత దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయని మత్స్యశాఖ అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments