Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కామ్‌: వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్ట్ (video)

సెల్వి
శనివారం, 19 జులై 2025 (20:57 IST)
Mithun Reddy
ఏపీ లిక్కర్ స్కామ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ లిక్కర్ కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. 
 
ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి శనివారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సుమారు ఏడు గంటల పాటు మిథున్ రెడ్డిని విచారించిన సిట్ అధికారులు.. అనంతరం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ విషయమై కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. ఏపీ లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్నారు.
 
మరోవైపు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఇటు ఏపీ హైకోర్టు, అటు సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించటంతో మిథున్ రెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. 
 
ఇక ఏపీ లిక్కర్ స్కాం కేసులో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ రెడీ చేసింది సిట్. ఈ చార్జ్ షీట్‌లో వందకుపైగా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టులతో పాటు వందకుపైగా ఎలక్ట్రానిక్ పరికరాల్ని స్వాధీనం చేసుకుంది. 11 మంది వాంగ్మూలం, స్టేట్ మెంట్ రికార్డులతో పాటు కుంభకోణం కేసులో స్వాధీనం చేసుకున్న అన్నీ పత్రాలను ఛార్జ్ షీట్ తో జతపరిచింది సిట్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజువల్‌గా మీకు అద్భుతమైన అనుభవం ఉంటుంది... రచ్చ రవి

ఫోటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు.. తస్మాత్ జాగ్రత్త : అదితి రావు హైదరీ

SS Rajamouli, దేవుడి మీద నమ్మకం లేదన్న రాజమౌళి సగటు మనిషే కదా... అందుకే...

ఆయన పిలిస్తే అన్నీ వదిలేసి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నా : రేణూ దేశాయ్

మహేష్ బాబు రాముడిగా కనిపిస్తారు: రాజమౌళి బిగ్ అప్డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments