Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మాగుంటకు ఈడీ నోటీసులు

Webdunia
గురువారం, 16 మార్చి 2023 (16:27 IST)
ఢిల్లీ మద్యం స్కామ్‌లో వైకాపాకు చెందిన ఒంగోలు ఎంపీ మాగుంటి శ్రీనివాసులు రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు నోటీసులు జారీచేశారు. అందులో ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని ఈడీ అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే మాగుంట తనయుడు రాఘవరెడ్డి ఈ కేసులో అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే.
 
మద్యం కేసులో గురువారం అరుణ్‌ పిళ్లైని కోర్టులో హాజరు పరిచిన అధికారులు.. ఐదు రోజుల పాటు కస్టడీకి కోరారు. ఇతర నిందితులతో కలిపి పిళ్లైని ప్రశ్నించాల్సి ఉందని కోర్టుకు తెలుపగా.. 3 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది.
 
అలాగే, కొందరు నిందితులు, సాక్షులను కలిపి ప్రశ్నిస్తున్నామని చెప్పిన ఈడీ అధికారులు.. కొందరిని మళ్లీ విచారణకు పిలిచినట్టు కోర్టుకు తెలిపారు. అదేవిధంగా గురువారం విచారణకు ఎమ్మెల్సీ కవిత రాలేదని కోర్టుకు ఈడీ సమాచారం ఇచ్చింది. 
 
పిళ్లై కస్టడీ పొడిగిస్తే శుక్రవారం బుచ్చిబాబుతో కలిసి ప్రశ్నిస్తామంది. ఈ కేసులోనే వైకాపా ఎంపీ శ్రీనివాసుల రెడ్డికి నోటీసులు ఇచ్చినట్టు న్యాయస్థానానికి ఈడీ తెలిపింది. ఢిల్లీ మద్యం కేసు మూలాలు ఏపీలోనే ఉన్నట్టు తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments