వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు.. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు

Webdunia
ఆదివారం, 16 ఏప్రియల్ 2023 (09:42 IST)
మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు దూకుడు ప్రదర్శించారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల్లో ఒకరైన కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. పులివెందులలో భాస్కర్ రెడ్డి అదుపులోకి తీసుకున్న అధికారులు... కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, శుక్రవారం నాడు కూడా కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెల్సిందే. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడైన ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెల్సిందే. 
 
కాగా, అవినాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన సీబీఐ... వివేకా హత్య కేసుతో ఆయనకు కూడా సంబంధం ఉన్నట్టు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇపుడు వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం సంచలనంగా మారింది. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తుందా లేదా అన్నది సందిగ్ధంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments