Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర మహిళల పాలిట నరకాసురుడు.. బాబును ఇంకెవ్వరితో పోల్చాలి.. రోజా ఫైర్

Webdunia
గురువారం, 25 అక్టోబరు 2018 (14:14 IST)
డ్వాక్రా మహిళలను నిండా ముంచేసిన ఏపీ సీఎం చంద్రబాబు, రాష్ట్ర మహిళల పాలిట నరకాసురుడేనని వైకాపా మహిళా నేత రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విజయవాడలో కాల్ మనీ సెక్స్ రాకెట్‌తో సంబంధమున్న తెలుగుదేశం నేతలను వెనకేసుకుని వస్తూ, ఇసుక దందాను ప్రశ్నించిన మహిళా అధికారులను కాళ్లతో తన్నిన ఎమ్మెల్యేను కాపాడుకుంటూ వస్తున్న చంద్రబాబునాయుడిని నరకాసురుడితో కాకుండా ఇంకెవరితో పోల్చాలని రోజా ప్రశ్నించారు. 
 
ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ల అక్రమ రవాణాలో దేశంలోనే నంబర్ వన్ స్థానానికి చేరిందని, ఇది కూడా చంద్రబాబు ఘనతేనని ఎద్దేవా చేశారు. ఇంకా గురువారం రోజా మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో ప్రకటించిన 600 హామీలను అమలు చేయడంలో విఫలమైందని చెప్పారు. అలాంటి పార్టీకి ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. మహిళలను అప్పుల పాలు చేసిన చంద్రబాబును, శూర్పణకల వంటి మహిళా మంత్రులు మాత్రమే దేవుడంటున్నారని విమర్శలు గుప్పించారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం