సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యం.. అవినీతిలో బాబే సీనియర్: ఏకిపారేసిన రోజా

రాజకీయాల్లో తానే సీనియర్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా సెటైర్లు విసిరారు. అవినీతిలో సీఎం చంద్రబాబే సీనియర్ అని రోజా ఆరోపించారు. సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్

Webdunia
బుధవారం, 7 జూన్ 2017 (13:33 IST)
రాజకీయాల్లో తానే సీనియర్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా సెటైర్లు విసిరారు. అవినీతిలో సీఎం చంద్రబాబే సీనియర్ అని రోజా ఆరోపించారు. సీనియారిటీ కంటే సిన్సియారిటీ ముఖ్యమనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. తన సీనియారిటీతో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఒరగబెట్టిందేమీ లేదని.. కానీ అవినీతిలో మాత్రం సీనియారిటీని బాగా ఉపయోగించుకున్నారని విమర్శించారు. 
 
ఎన్నికల ప్రచారంలో 15 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు ప్రస్తావించిన విషయం నిజమా? కాదా? అని రోజా ప్రశ్నించారు. అవాస్తవాలతో కూడిన అభివృద్ధి రేటును చూపిస్తూ కేంద్రాన్ని కూడా చంద్రబాబు తప్పుదారి పట్టిస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుపడుతున్నారని రోజా అన్నారు. 
 
హైదరాబాదులో రోజా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వల్ల ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు అసెంబ్లీలో రెండు సార్లు ఎందుకు తీర్మానం చేశారని ప్రశ్నించారు. హోదా వల్ల ఎలాంటి ప్రయోజ నాలున్నాయో ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లకు వెళ్తే తెలుస్తుందని, ఆయా రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టిన సుజనా చౌదరి, సిఎం రమేష్‌లను అడిగినా చెబుతారని ఎద్దేవా చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

ఎవరు కొత్త తరహా సినిమా చేసినా ప్రోత్సాహించాలి, లేకుంటే ముందడుగు వేయలేరు : కార్తి

మాకు మనవళ్ళు పుట్టినా నాగార్జున అలానే ఉన్నారు.. యాంటీ ఏజింగ్ టెస్టులు చేయాలి...

విదు, ప్రీతి అస్రాని మ‌ధ్య కెమిస్ట్రీ 29 సినిమాకు ప్ర‌ధానాక‌ర్ష‌ణ

మగాళ్లను మొక్కు కుంటూ కాదు తొక్కు కుంటూ పోతం.. పురుష కొత్త పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీజనల్ ఫ్రూట్ రేగు పండ్లు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఫ్యాషన్‌ను ప్రముఖమైనదిగా నడిపించే బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్

అధునాతన క్యాన్సర్ చికిత్సకై టాటా మెమోరియల్ ఎసిటిఆర్ఇసితో కోటక్ మహీంద్రా భాగస్వామ్యం

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

పది లక్షల మంది పిల్లల్లో ప్రకటనల అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యం

తర్వాతి కథనం
Show comments