Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమస్యలు ప్రస్తావిస్తే చెప్పుతో కొడతా : గ్రామస్థులకు వైకాపా ఎమ్మెల్యే కాపు వార్నింగ్

Webdunia
గురువారం, 1 జూన్ 2023 (08:58 IST)
తాను వచ్చినపుడు సమస్యల గురించి ప్రస్తావిస్తే చెప్పుతో కొడతానని గ్రామస్థులకు వైకాపా ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి హెచ్చరించారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం గోవిందవాడలో బుధవారం నిర్వహించారు. ఈ సంద్భంగా ఆయనకు గ్రామస్థులు తమ సమస్యల గురించి మొరపెట్టుకున్నారు. 
 
తమకు ప్రతి నెలా రేషన్ సరకులు రావడం లేదని వాపోయారు. పక్కా ఇళ్లు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. పైగా, ఈ నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేశారని ఇక్కడకు వచ్చారంటూ నిలదీశారు. ఈ మాటలతో కాపు రామచంద్రారెడ్డికి ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన వద్ద సమస్యల గురించి ప్రస్తావిస్తే చెప్పుతో కొడతానంటూ పచ్చి బూతులతో దూషించారు. 
 
ఆ సమయంలో అక్కడ పోలీసులు ఉన్నప్పటికీ సైలెంట్‌గా ఉండిపోయారు. పైగా, పోలీసులతో కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించండతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, స్థానిక వైకాపా నేతలు గ్రామస్థులకు సర్దిచెప్పడంతో స్థానికులు శాంతించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments