పవన్‌తో భేటీ అయిన వైకాపా కీలక నేత!

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (08:59 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో వైకాపాకు చెందిన కీలక నేత ఒకరు భేటీ అయ్యారు. హైదరాబాద్ నగరంలో ఈ భేటీ జరిగింది. ఆ నేత పేరు బొంతు రాజేశ్వర రావు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ వైకాపా కీలక నేత. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైకాపా అభ్యర్థిగా రాజేశ్వర రావు పోటీ చేయగా, ఆయనపై జనసేన పార్టీ అభ్యర్థి గెలుపొందారు. 
 
ఇపుడు రాజేశ్వర రావు జనసేనానితో భేటీ కావడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్ ఆర్.డబ్ల్యూఎస్ రాష్ట్ర మాజీ సలహాదారు అయిన రాజేశ్వర రావు హైదరాబాద్ నగరంలోని జనసేన పార్టీ కార్యలయంలో సమావేశమయ్యారు. 
 
కాగా, ఈయన గత 2014, 2019 ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా వైకపా నేతలు అంటీఅంటనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌తో ఆయన భేటీ కావడం ఇపుడు రాజకీయ వర్గాల్లో చర్చీనీయాంశంగా మారింది. ఈయన త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే ఇరు పార్టీల శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments