బీజేపీకి మిత్రపక్షం వైసీపీ: పీసీసీ

Webdunia
సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (07:59 IST)
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వైసీపీ అతి విశ్వాసమైన మిత్రపక్షమని పీసీసీ చీఫ్‌ సాకే శైలజనాథ్‌ అన్నారు. వైసీపీ నేతలు  సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌లపై ఢిల్లీలో ఒకమాట, అమరావతిలో మరో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు.

విజయవాడలో ఆయన మీడియాతో  మాట్లాడారు. ‘రాష్ట్ర ప్రయోజనాలు’ ప్రతి ఒక్కరికీ ఒక వాడుకపదంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. లోగడ చంద్రబాబు ఈవిధంగా ‘రాష్ట్ర ప్రయోజనా’లను ఉపయోగించుకుని ఏమీ సాధించలేకపోయారని ఎద్దేవా చేశారు.

శాసనమండలిని రద్దు చేయాలని ఢిల్లీ పెద్దలను కోరడం రాష్ట్ర ప్రయోజనమా అని సీఎం జగన్‌ను నిలదీశారు. ఒకపక్క బీజేపీ ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని చెబుతున్నా వాళ్ల కాళ్లు పట్టుకోవడానికి గల కారణం ఏమిటని అడిగారు.

రాజధాని అమరావతిపై బీజేపీ నేతలు నచ్చినట్లుగా ప్రకటన చేస్తూ నాటకాలు ఆడుతున్నారని శైలజానాథ్‌ విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Renu Desai: రేబిస్‌ టీకా వేయించుకున్న రేణు దేశాయ్.. వీడియో వైరల్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments