Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెట్టి చాకిరీ చేయించుకున్న సంస్థకు జరిమానా!

Webdunia
శుక్రవారం, 24 అక్టోబరు 2014 (11:06 IST)
భారతీయ నిపుణులతో వెట్టి చాకిరీ చేయించుకుని అతి తక్కువ వేతనాలిచ్చిన ఓ అమెరికా కంపెనీకి జరిమానా విధించారు. సిలికాన్ వ్యాలీ కేంద్రంగా ప్రింటింగ్ రంగంలో పేరుగాంచిన ‘ఎలక్ట్రానిక్స్ ఫర్ ఇమేజింగ్ ఇన్ కార్పొరేటెడ్’ సంస్థ భారతీయుల శ్రమను దోచుకుంది. ఇందుకుగాను రూ.25,80,000లను భారతీయ నిపుణులకు పెనాల్టీగా చెల్లించాలని ఆ సంస్థకు అమెరికా కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. 
 
గతేడాది 728 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించిన ఆ సంస్థ భారతీయ నిపుణులతో మితిమీరిన స్థాయిలో పనిచేయించుకుని, వారికి తగిన మేర వేతనాలు ఇవ్వకపోవడంతో పాటు ఉద్యోగుల వేతనాల చెల్లింపు విషయంలో సదరు సంస్థ నిబంధనలను అతిక్రమించిందని కూడా అమెరికా కార్మిక శాఖ తేల్చింది.
 
కంపెనీ పురోగతి కోసం వారానికి 122 గంటల పాటు పనిచేసిన ఎనిమిదిమంది భారత నిపుణులు గంటకు కేవలం 1.21 డాలర్లను మాత్రమే అందుకున్నట్లు కార్మిక శాఖ తెలిపింది. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments