Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమాభారతి సమక్షంలో హరీష్ - దేవినేని మాటల యుద్ధం.. 'చాయ్' సలహా ఇచ్చిన మంత్రి

కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు, ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుల మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ నోరు పారేసుకున్నారు. దీంతో మంత్రి ఉమాభారత

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (11:16 IST)
కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు, ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుల మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ నోరు పారేసుకున్నారు. దీంతో మంత్రి ఉమాభారతి జోక్యం చేసుకుని వారిద్దరికి టీ ఇచ్చి శాంతపరిచారు. 
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కృష్ణా జలాల విషయమై అపెక్స్ కమిటీలో వాదనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య ఓ దశలో తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కేంద్ర మంత్రి ఉమాభారతి స్వయంగా కల్పించుకోవాల్సి వచ్చింది. నందిగామ ప్రాంతానికి తెలంగాణ భూభాగం నుంచి నీరివ్వాలని, అందుకు సహకరించాలని ఏపీ మంత్రి దేవినేని ఉమ ప్రస్తావించారు. దీంతో తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలకు దిగారు. 
 
తాము సహకరిస్తున్నా, ఏపీ తమ ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన గట్టిగా మాట్లాడారు. పట్టిసీమ నుంచి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నందున, ఆదా అయ్యే నీటిలో తమకూ వాటా కావాల్సిందేనని హరీశ్ పట్టుబట్టారు. దీంతో ఇరువురి మధ్య మాటలు అదుపు తప్పుతున్నాయని భావించిన ఉమా భారతి జోక్యం చేసుకుని ప్రశాంతంగా ఉండాలని సూచించారు. "అప్పుడప్పుడూ కలిసి చాయ్ తాగండి. మాట్లాడుకోండి. అప్పుడిలా విభేదాలుండవు" అంటూ వారిని సముదాయించారు. 

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments