Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉమాభారతి సమక్షంలో హరీష్ - దేవినేని మాటల యుద్ధం.. 'చాయ్' సలహా ఇచ్చిన మంత్రి

కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు, ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుల మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ నోరు పారేసుకున్నారు. దీంతో మంత్రి ఉమాభారత

Webdunia
గురువారం, 22 సెప్టెంబరు 2016 (11:16 IST)
కేంద్ర మంత్రి ఉమాభారతి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు, ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుల మధ్య మాటల యుద్ధం జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ నోరు పారేసుకున్నారు. దీంతో మంత్రి ఉమాభారతి జోక్యం చేసుకుని వారిద్దరికి టీ ఇచ్చి శాంతపరిచారు. 
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కృష్ణా జలాల విషయమై అపెక్స్ కమిటీలో వాదనలు జరుగుతున్నాయి. ఈ సమయంలో ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య ఓ దశలో తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో కేంద్ర మంత్రి ఉమాభారతి స్వయంగా కల్పించుకోవాల్సి వచ్చింది. నందిగామ ప్రాంతానికి తెలంగాణ భూభాగం నుంచి నీరివ్వాలని, అందుకు సహకరించాలని ఏపీ మంత్రి దేవినేని ఉమ ప్రస్తావించారు. దీంతో తెలంగాణ మంత్రి హరీశ్ రావు తీవ్ర విమర్శలకు దిగారు. 
 
తాము సహకరిస్తున్నా, ఏపీ తమ ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన గట్టిగా మాట్లాడారు. పట్టిసీమ నుంచి గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తున్నందున, ఆదా అయ్యే నీటిలో తమకూ వాటా కావాల్సిందేనని హరీశ్ పట్టుబట్టారు. దీంతో ఇరువురి మధ్య మాటలు అదుపు తప్పుతున్నాయని భావించిన ఉమా భారతి జోక్యం చేసుకుని ప్రశాంతంగా ఉండాలని సూచించారు. "అప్పుడప్పుడూ కలిసి చాయ్ తాగండి. మాట్లాడుకోండి. అప్పుడిలా విభేదాలుండవు" అంటూ వారిని సముదాయించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments