Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను చనిపోయాన‌ట‌... పెన్షన్ ఆపేశారు! వృద్ధ మ‌హిళ ఆవేద‌న‌

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (09:48 IST)
ఆమె బ‌తికుండ‌గానే రెవిన్యూ రికార్డుల్లో చంపేశారు. డెడ్ అని స‌ర్టిఫికేట్ ఇచ్చేశారు. వ‌చ్చే పెన్ష‌న్ ని అపేశారు. బాబూ నేనింకా బ‌తికే ఉన్నా అంటూ ఆ వృద్ధ మ‌హిళ ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది.

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ కొత్తపాలెం గ్రామానికి చెందిన కొక్కిలిగడ్డ సుందరమ్మ అనే వృద్ధురాలు ప్రతినెలా వితంతు పెన్షన్ తీసుకుంటూ ఉంది. రెండు నెలల క్రితం అనారోగ్య సమస్యలతో తన కుమార్తె వద్ద కొన్ని రోజులు ఉండటానికి వెళ్ళింది. ఆ తర్వాత తిరిగి వ‌చ్చి, తనకు పెన్షన్ ఇవ్వలేదని ఆ గ్రామ వాలంటైర్ ని అడుగగా, వచ్చేనెలలో రెండు నెలల పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత నెల కూడా తనకు పెన్షన్ ఇవ్వలేదని వాపోయింది.

తాజాగా ఈ నెలలో కూడా తనకు పెన్షన్ రాకపోవడంతో, గ్రామ వాలంటైర్ ని ప్రశ్నించగా, ఆమె సరైన సమాధానం చెప్పలేదు. నా పెన్ష‌న్ ఏద‌ని గట్టిగా అడిగితే, పై అధికారులు చెప్ప వద్దన్నారని చెబుతూ తనకు పెన్షన్ ఇవ్వలేదని వృద్ధురాలు తెలిపింది. పెన్షన్ ఇవ్వకపోగా, తాను చనిపోయానని అంటున్నారని వృద్ధురాలు వాపోయింది.

ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు మూడు నెలలుగా రావాల్సిన పెన్షన్ ఇప్పించాల్సిందిగా వేడుకుంటోంది ఆ మ‌హిళ‌.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అభిమానులు గర్వంగా చెప్పుకోదగ్గ సినిమా మట్కా అవుతుంది : వరుణ్ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments