Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనంతలో మహిళను వివస్త్రను చేసి.. చితకబాదిన గ్రామస్తులు..!

Webdunia
మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (17:46 IST)
సభ్య సమాజాం సిగ్గుపడే రీతిలో మరో దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులంతా ఏకమై ఓ మహిళను వివస్త్రను చేసి, చితకబాదారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా హిందూపురం పరిధిలోని వడ్డిపల్లి గ్రామంలో కలకలం రేపింది. 
 
పోలీసుల వివరాల ప్రకారం.. కళ్యాణి దుర్గానికి చెందిన గౌరీబాయి పది సంవత్సరాల క్రితం హిందూపురం ప్రాంతానికి వలస వచ్చింది. అక్కడ ఆ మహిళ వడ్డిపల్లి గ్రామంలో ప్రభుత్వ స్థలంలో ఒక షెడ్‌ వేసుకుని జీవనం సాగిస్తోంది. 
 
అయితే ఆ స్థలంలో దేవాలయాన్ని నిర్మించాలని స్థానికులు భావించారు. ఇందుకోసం ఆ మహిళను ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా గ్రామస్థులు తెలిపారు. అయితే ఆమె ససేమిరా అనడంతో ఆమెతో గొడవ పడ్డారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ విషయంలో కల్పించుకున్న పోలీసులు మహిళకు వేరే చోట నివాసం ఏర్పాటు చేసి ఇవ్వాలని గ్రామస్థులకు సూచించారు. ఈ స్థితిలో గ్రామస్థులు కొందరు మంగళవారం రోజు మహిళపై దాడికి పాల్పడ్డారు. ఆమెను వివస్త్రను చేసి చితకబాదారు. 
 
సమాచారం అందుకున్న హిందూపురం పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే, గ్రామస్థులు కొందరు మాత్రం ఆ మహిళ మంత్రాలు చేస్తోందని, పలువురితో వ్యభిచారం చేస్తోందని  ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. 

భార్య భర్తల అహం తో విద్య వాసుల అహం చిత్రం - ట్రైలర్ కు స్పందన

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

Show comments