Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తపై కోపంతో కిరోసిన్‌ పోసి నిప్పంటించుకున్న భార్య

Webdunia
బుధవారం, 18 మే 2016 (14:56 IST)
చిత్తూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. క్షణికావేశంలో భర్తపై ఉన్న కోపంతో ఓ మహిళ ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. భార్యను కాపాడబోయిన భర్తకు తీవ్రగాయాలయ్యాయి. భార్యాభర్తలిద్దరు చావుబతుకుల మధ్య ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
 
చిన్నగొట్టికల్లు దిగువ వీధిలో శ్రీనివాసులు, రేణుకలు నివాసముంటున్నారు. పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. చిన్న విషయానికి కూడా భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేదని స్థానికులు చెబుతున్నారు. బుధవారం ఉదయం వీరి మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరగడంతో మనస్థాపానికి గురైన రేణుక ఇంటిలో తలుపులు మూసుకుని కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. 
 
దీన్ని గమనించిన భర్త శ్రీనివాసులు తలుపులు పగులగొట్టి రేణుకను కాపాడే ప్రయత్నం చేయగా అతను కూడా మంటల్లో చిక్కుకున్నాడు. ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ప్రభుత్వాసుప్రతికి తరలించారు. రేణుక, శ్రీనివాసుల పరిస్థితి ఆందోళనా కరంగా వైద్యులు నిర్థారించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాశ్మీర్ ఇండియాదే, పాకిస్తాన్‌ను అలా వదిలేస్తే వాళ్లలో వాళ్లే కొట్టుకుని చస్తారు: విజయ్ దేవరకొండ

మాలీవుడ్‌‍ను కుదిపేస్తున్న డ్రగ్స్... మరో ఇద్దరు దర్శకులు అరెస్టు

Retro Promotions: ఘనంగా సూర్య 'రెట్రో' ప్రీ రిలీజ్ వేడుక- విజయ్ దేవరకొండ స్పీచ్ అదుర్స్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

'ది గ్రీన్ ఫ్లీ'ను ప్రారంభించిన ఇనార్బిట్ సైబరాబాద్

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

Annapurna yojana scheme: మహిళలకు వరం.. అన్నపూర్ణ యోజన పథకం.. షరతులు ఇవే

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

తర్వాతి కథనం
Show comments