Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్త శవంతో మూడు రాత్రులు గడిపిన భార్య! ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 15 మే 2020 (15:00 IST)
అసలే కరోనా మహమ్మారి. ఇలాంటి సమయంలో సాధారణంగా చనిపోయినా కరోనా వైరస్‌తోనే చనిపోయారనే భయం పీడిస్తోంది. అందుకే సొంత కన్నతల్లిదండ్రులు చనిపోయినా, కన్నబిడ్డలు, తోబుట్టువులు, బంధువులు ఇలా ఏ ఒక్కరూ శవం సమీపానికి కూడా రావట్లేదు. అందుకేనేమో ఆ భార్య భర్త శవాన్ని ఇంట్లో పెట్టుకుని మూడు రోజుల ఒంటరిగా ఉండిపోయింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నిజామాబాద్ జిల్లా కొత్త హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన లింగా రెడ్డి అనే వ్యక్తి వృద్దాప్య సమస్యలతో మూడు రోజుల క్రితం చనిపోయాడు. ఈ విషయం మతిస్థిమితంలేని ఆయన భార్య శకుంతలకు తెలియదు. 
 
అలా మూడు రోజులపాటు గడిచిపోయింది. అయితే, లింగారెడ్డి ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని ఇరుగుపొరుగువారు గుర్తించి  ఇంట్లోకి వెళ్లి చూడగా లింగారెడ్డి చనిపోయివున్నాడు. దీంతో పోలీసులకు సమాచారం చేరవేయగా, వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ లింగారెడ్డి కుమారుడు హైదరాబాద్‌లో ఉండగా, కుమార్తె మాత్రం ఇంగ్లండ్‌లో నివసిస్తోంది. వీరికి పోలీసులే తండ్రి చనిపోయిన విషయాన్ని చేరవేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments