Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతిపై రేప్.. ఆపై యాసిడ్ పోసి హత్యాయత్నం!

Webdunia
గురువారం, 22 జనవరి 2015 (13:09 IST)
యువతిపై అత్యాచారం జరిపిన అనంతరం యాసిడ్ పోసి హత్యాయత్నం ఘటన మెదక్ జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని దిలాల్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించి బాధితులు, పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. 
 
దిలాల్‌పూర్ గ్రామానికి చెందిన 32 ఏళ్ల మహిళను మంగళవారం రాత్రి ధర్మారెడ్డిపల్లికి చెందిన స్వామి, పిడిచెడ్‌కు చెందిన కృష్ణ అనే ఇద్దరు వ్యక్తులు మాయమాటలతో నమ్మించి మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న ఆమెను గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. 
 
అనంతరం ఆనవాళ్లు తెలియకుండా చేసేందుకు ఆమెపై యాసిడ్ పోశారు. యువతి మరణించిందని భావించిన ఆ వ్యక్తులు అక్కడ నుండి పరారయ్యారు. 
 
అయితే బుధవారం స్పృహలోకి వచ్చిన ఆ యువతి సాయంత్రం గజ్వేల్ పోలీసులను ఆశ్రయించడంతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలిని గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments