Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు దూరమై.. పుట్టింటిలో వుంది.. ఇంతలో ఏమైంది.. పిల్లల గొంతుకోసి..?

Webdunia
మంగళవారం, 18 మే 2021 (12:21 IST)
భర్తకు దూరమై.. పుట్టింటిలో వున్న ఓ వివాహిత ఇద్దరు పిల్లలను గొంతుకోసి చంపేయడంతో పాటు ఆమెకు గొంతుకోసుకుంది. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోగా, ఆమె కూడా ఆస్పత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.
 
వివరాల్లోకి వెళితే.. పొదిలి మండలం ఉప్పలపాడుకు చెందిన గుంటూరి రంగయ్య, కోటేశ్వరమ్మల కూతురు ఆదిలక్ష్మికి ఐదేళ్ల క్రితం శింగరాయకొండకు చెందిన కరేటి శ్రీహరితో వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. 20 రోజుల క్రితం ఆదిలక్ష్మి పిల్లలను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. 
 
సోమవారం పుట్టింటిలోని వారంతా పొలం పనులకు వెళ్లగా ఆమె ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉంది. ఆ సమయంలో కత్తితో ఇద్దరు పిల్లల గొంతు కోసింది. ఆపై తన గొంతూ కోసుకుంది. ముగ్గురూ రక్తపు మడుగులో పడిపోగా.. పొలం నుంచి ఇంటికి వచ్చిన ఆదిలక్ష్మి సోదరుడు వెంకటరమణయ్య ఇరుగుపొరుగు సాయంతో ఆదిలక్ష్మి, ఆమె ఇద్దరు పిల్లలను ఒంగోలు రిమ్స్‌కు తరలించాడు.
 
అయితే ఒంగోలు చేరడానికి ముందే మార్గమధ్యలో పిల్లలిద్దరూ చనిపోయారు. కొన ఊపిరితో ఉన్న ఆదిలక్ష్మిని రిమ్స్‌లో చేర్పించాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments