Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరిలో ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటపై దాడి.. యువతి గ్యాంగ్‌పై రేప్...

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (13:15 IST)
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని ఓ భాగమైన మంగళగిరిలో దారుణం జరిగింది. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఆ తర్వాత యువతిపై సామూహిక అత్యాచారం జరిపారు. ఈ ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది. 
 
సోమవారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, తాడేపల్లికి చెందిన చుంచు శ్రీనివాస్ (26), అంగడి జ్యోతి (24) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. సోమవారం సాయంత్రం ఇద్దరూ కలిసి ఉడా టౌన్‌షిప్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలోని డొంక రోడ్డులోకి వెళ్లారు. 
 
వారిద్దరూ అక్కడ ఏకాంతంగా ఉన్నారు. రాత్రి 9 గంటల సమయంలో వీరిద్దరినీ గమనించిన ముగ్గురు దుండగులు వారిపై ఇనుప రాడ్లతో దాడిచేశారు. ఈ దాడిలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తర్వాత జ్యోతిపై ప్రియుడి ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడి పారిపోయాడు. అయితే, ఆ దండుగల నుంచి తప్పించుకునేందుకు జ్యోతి తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమెపై కూడా దాడిచేశారు. ఈ దాడిలో ఆమె తీవ్రంగా గాయలపాలైంది. 
 
రక్తపుమడుగులో పడివున్న జంటను చూసిన స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ చినకాకాని ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. యువతి అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందగా, యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments