డాక్టర్లకు చెబితే బోర్లా పడుకోబెట్టి గుండెపై తట్టమన్నారు...

Webdunia
బుధవారం, 12 మే 2021 (14:14 IST)
తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిన్ సరఫరాలో తలెత్తిన లోపం వల్ల పదుల సంఖ్యలో కోవిడ్ రోగులు మృత్యువాతపడ్డారు. వీరిలో అనేకమంది తమ కుటుంబ సభ్యులను కోల్పోయారు. ఇలాంటివారంతా ఆస్పత్రిలో ఏం జరిగిందో పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. ముఖ్యంగా, తన భర్తను కోల్పోయిన మదనపల్లెకు చెందిన మాజీ కౌన్సిలర్‌ జయమ్మ తన భర్త ఏ విధంగా మృతి చెందాడో కన్నీటి పర్యంతమవుతూ వివరించింది. 
 
'వారంరోజుల మెరుగైన చికిత్సతో నా భర్త వేణుగోపాల్‌(50) కోలుకున్నాడు. గాలి బాగా పీల్చుకుని వదిలేస్తే బుధ, గురువారాల్లో డిశ్చార్చి చేస్తామని వైద్యులు చెప్పారు. అప్పుడప్పుడు ఆయన వెంటిలేటర్‌ తీసేసి బయటి గాలి పీల్చుకుంటూ ఉన్నాడు. నాకేం భయం లేదు. రెండు రోజుల్లో ఇంటికెళ్దామన్నాడు. ఆ మాట చెప్పిన కొన్ని గంటల్లోనే.. సోమవారం రాత్రి ఆక్సిజన్‌ ఆగిపోయింది. 
 
బాధితుల బంధువులు ఒక్కసారిగా వచ్చి బెడ్‌పై పడిపోవడంతో గందరగోళం నెలకొంది. మా ఆయన కళ్లు తేలేశాడు. డాక్టర్లకు చెబితే బోర్లా పడుకోబెట్టి గుండెపై తట్టమన్నారు. ఇలా అరగంట పాటు చేశా. అంతలోనే ఆక్సిజన్‌ వచ్చేసింది. కానీ, అప్పటికే మా ఆయన ప్రాణం పోయింది. ఐదు నిమిషాల్లో ఆక్సిజన్‌ వచ్చుంటే ప్రాణం నిలిచేదేమో?' అని మదనపల్లెకు చెందిన మాజీ కౌన్సిలర్‌ జయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు..

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments