Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ముసుగు దొంగలు.. వ్యాపారి ఇంట్లో చొరబడి మహిళను చంపేశారు..!

సెల్వి
శుక్రవారం, 19 జులై 2024 (10:30 IST)
తిరుపతిలో ముసుగు యువకుల దాడిలో ఓ వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందగా, బాలికకు తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. నగరంలోని రాయల్ నగర్‌లో గురువారం వ్యాపారి శ్రీనివాస్ ఇంట్లోకి వృద్ధురాలు, బాలిక మినహా కుటుంబ సభ్యులందరూ లేని సమయంలో ముసుగు ధరించిన యువకుడు చొరబడ్డాడు. 
 
ఇంట్లో ఉన్న మహిళ, బాలికపై దాడి చేశాడు. కత్తి దాడిలో 75 ఏళ్ల జయలక్ష్మి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. బాలిక నియాతి (12) తీవ్రంగా గాయపడగా, ఆమెను ఆసుపత్రికి తరలించారు. దాడి అనంతరం యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. 
 
దాడి చేసిన వ్యక్తి ఒంటరిగా వచ్చాడా లేక ఇతరులతో వచ్చాడా అనేది తెలియరాలేదు. రెండేళ్ల క్రితం ఈ వ్యాపారి కుటుంబ సభ్యులపై కూడా ఇదే తరహాలో కత్తి దాడి జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. 
 
పోలీసు సిబ్బందితో కలిసి ఎస్పీ ఇంటిని పరిశీలించారు. ఇప్పటికే వరకు చిక్కిన ఆధారాల ఆధారంగా దుండగుడిని పట్టుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments