Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోడలిని చంపి పాతిపెట్టిన అత్తమామలు : హతురాలు జగన్ వ్యక్తిగత కెమరామెన్ భార్యనా?

Webdunia
గురువారం, 8 అక్టోబరు 2015 (17:08 IST)
కృష్ణా జిల్లాలో ఓ దారుణం వెలుగు చూసింది. అత్తమామలు కలిసి తమ కోడలిని చంపి కాలువగట్టున పూడ్చిపెట్టారు. ఈ విషయం తాజాగా వెలుగుచూసింది. ఈ హతురాలు వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి వద్ద వ్యక్తిగత ఫోటోగ్రాఫర్‌గా పని చేస్తున్న వ్యక్తి భార్యగా భావిస్తున్నారు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
కృష్ణా జిల్లా నాగాయలంక మండలం బరంకులకు చెందిన వంశీకృష్ణ భార్య వరలక్ష్మి మూడు నెలల క్రితం కనిపించకుండా పోయింది. దీనిపై వంశీకృష్ణ తన తల్లిదండ్రులతో కలిసి తన భార్య కనిపించడం లేదంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి మిన్నకుండిపోయారు.
 
అయితే, వరలక్ష్మి తల్లిదండ్రులు మాత్రం రాష్ట్ర మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. తమ కుమార్తె కనిపించడం లేదనీ, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన హెచ్‌ఆర్సీ.. వరలక్ష్మి అదృశ్యాన్ని తేల్చాలంటూ జిల్లా ఎస్పీని ఆదేశించింది. 
 
దీంతో రంగంలోకి దిగిన జిల్లా పోలీసులు వరలక్ష్మి అదృశ్యం మిస్టరీని చేధించారు. వరలక్ష్మిని అత్తామామలు కలిసి హత్య చేసి స్థానికంగా ఉండో ఓ పంట కాల్వకు సమీపంలోనే పాతిపెట్టినట్టు కనుగొన్నారు. విషయం వెలుగులోకి రావడంతో వంశీకృష్ణ కనిపించకుండా పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

Show comments