Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తాకోడళ్ల వివాదం.. కోడలు చెవిని కొరికేసింది.. అత్త చెవి ఊడిపోయింది..

సెల్వి
మంగళవారం, 8 అక్టోబరు 2024 (10:46 IST)
అత్తా కోడళ్ల వివాదం మామూలుగా వుండదు. అలాంటిది అత్తతో గొడవపడిన కోడలు.. ఏకంగా అత్త చెవిని కొరికేసింది. ఈ ఘటన ఏపీలో వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా తుళ్లూరులో నివసిస్తున్న కంభంపాటి శేషగిరి, పావని (30) దంపతులకు ఇద్దరు కుమారులు.. కొన్ని రోజులుగా కోడలు పావనికి అత్త నాగమణి (55) కి కుటుంబ కలహాల కారణంగా వివాదం నడుస్తోంది. 
 
ఈ క్రమంలో పావని, నాగమణికి ఆదివారం రాత్రి గొడవ జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది.. దీంతో కొడలు పావని క్షణికావేశంలో అత్త నాగమణి చెవిని కొరికింది. దీంతో నాగమణి చెవి భాగం మొత్తం ఊడిపోయింది. 
 
వెంటనే ఆమె కుటుంబ సభ్యులు నాగమణిని తెగిన చెవితోపాటు తుళ్లూరు పీహెచ్‌సీకి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ చెవిని అతుక్కోవడం కష్టమని వైద్యులు తేల్చి చెప్పేశారు. ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంతకు... హైదరాబాద్‌కు రావడానికి దారేది అనాలేమో : త్రివిక్రమ్ (Video)

"పుష్ప-2" ప్రీరిలీజ్ బిజినెస్ రూ.1000 కోట్లా?

చిత్రమైన డ్రెస్ తో సమంత - ముంబైలోనేకాదు హైదరాబాద్ కు దారేదీ అని రాలేరా? త్రివిక్రమ్ ప్రశ్న

ఓదెల 2- ఓదెల విలేజ్ లో ఫైనల్ షెడ్యూల్ లో తమన్నా భాటియా

అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ల పుష్ప- 2 ది రూల్‌ ఫస్టాఫ్‌ లాక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎలాంటి కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది?

ఈ 5 పాటిస్తే జీవితం ఆనందమయం, ఏంటవి?

న్యూజెర్సీలో దిగ్విజయంగా నాట్స్ క్రికెట్ టోర్నమెంట్

కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు తేనెలో ఇవి కలిపి తీసుకుంటే...

రాత్రి భోజనం ఆరోగ్యకరంగా వుండాలంటే?

తర్వాతి కథనం
Show comments