Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళా కండక్టర్‌ను హత్య చేసి పెట్రోల్ పోసి తగులబెట్టారు.. ఎవరు? ఎక్కడ?

ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళా కండక్టర్‌ను హత్య చేసి ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. తాజాగా జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఏపీఎస్ఆర్టీసీలో కల్యాణి అనే మహిళ కండక్టర్‌గా పనిచేస్తోంద

Webdunia
గురువారం, 8 జూన్ 2017 (12:12 IST)
ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళా కండక్టర్‌ను హత్య చేసి ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. తాజాగా జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... ఏపీఎస్ఆర్టీసీలో కల్యాణి అనే మహిళ కండక్టర్‌గా పనిచేస్తోంది. రెండు రోజుల కిందట అదృశ్యమైన ఆమె.. ప్రాణాలు కోల్పోయి, సగం కాలిన స్థితిలో కనిపించింది.
 
ఈమె తన భర్త రాఘవయ్యతో కలిసి గంటూరు నగరంలోని సంపత్ నగర్‌లో నివశిస్తూ వచ్చింది. తన కనిపించడం లేదంటూ భర్త పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఇంతలో సోమవారం గుంటూరు శివారు బొంతపాడులో సగం కాలిపోయిన మహిళ శవాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ శవం కల్యాణిదేనని నిర్ధారించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 
కల్యాణిని భర్త రాఘవయ్యే చంపేసి ఉంటాడని ఆమె కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. సంపత్‌ నగర్‌లోని ఇంట్లోనే రోకలి బండతోమోది కల్యాణిని చంపేసి, వాహనంలో శవాన్ని బొంతపాడుకు తీసుకొచ్చి తగులబెట్టి ఉంటారని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం రాఘవయ్యను విచారిస్తున్నామన్న పోలీసులు నిందితులను వదిలిపెట్టబోమని చెప్పారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments