Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు స్నేహితుడితో ఎఫైర్, భర్తకు తెలిసింది, అంతే...

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (22:17 IST)
వరసకు కొడుకైన వ్యక్తితోనే అక్రమ సంబంధం పెట్టుకుంది ఒక వివాహిత. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్న ఆమె భర్త పనుల మీద తరచూ బయటకు వెళ్ళడంతో వరుసకు కొడుకయ్యే వ్యక్తితో కమిట్ అయ్యింది. ఇది కాస్తా ఆమెను చివరకు కటాకటాల పాలు చేసింది.
 
తూర్పు గోదావరిజిల్లా పత్తిపాడు మండలం చింతలూరులో నివాసముంటున్నారు జంకల అప్పారావు. నిన్న ఆయన తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు భార్యను విచారించడంతో అసలు విషయం ఒప్పుకుంది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
అప్పారావు నూనె వ్యాపారం చేసేవాడు. తరచూ వివిధ ప్రాంతాలకు వెళ్ళేవాడు. ఇంటి పట్టున ఉండేవాడు కాదు. అప్పారావు భార్య ఇంట్లోనే ఉండేది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే తన కుమారుడి స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది తల్లి.
 
అతనితో పాటు మూడు నెలల పాటు బాగా ఎంజాయ్ చేసింది. అయితే భర్తకు విషయం తెలియడంతో మందలించాడు. పెళ్ళీడుకొచ్చిన కుమార్తెలు ఉంటే ఈ పనులు ఏంటంటూ ప్రశ్నించాడు. దీంతో భర్త హత్యకే స్కెచ్ వేసింది భార్య.
 
ప్రియుడితో కలిసి నిన్న రాత్రి నిద్రపోతున్న అప్పారావును దారుణంగా హత్య చేసింది. దోపిడీ దొంగల పనేనని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు జరిపితే అసలు విషయం బయటపడింది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments