Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడుకు స్నేహితుడితో ఎఫైర్, భర్తకు తెలిసింది, అంతే...

Webdunia
గురువారం, 10 సెప్టెంబరు 2020 (22:17 IST)
వరసకు కొడుకైన వ్యక్తితోనే అక్రమ సంబంధం పెట్టుకుంది ఒక వివాహిత. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్న ఆమె భర్త పనుల మీద తరచూ బయటకు వెళ్ళడంతో వరుసకు కొడుకయ్యే వ్యక్తితో కమిట్ అయ్యింది. ఇది కాస్తా ఆమెను చివరకు కటాకటాల పాలు చేసింది.
 
తూర్పు గోదావరిజిల్లా పత్తిపాడు మండలం చింతలూరులో నివాసముంటున్నారు జంకల అప్పారావు. నిన్న ఆయన తన ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు భార్యను విచారించడంతో అసలు విషయం ఒప్పుకుంది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
అప్పారావు నూనె వ్యాపారం చేసేవాడు. తరచూ వివిధ ప్రాంతాలకు వెళ్ళేవాడు. ఇంటి పట్టున ఉండేవాడు కాదు. అప్పారావు భార్య ఇంట్లోనే ఉండేది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే తన కుమారుడి స్నేహితుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది తల్లి.
 
అతనితో పాటు మూడు నెలల పాటు బాగా ఎంజాయ్ చేసింది. అయితే భర్తకు విషయం తెలియడంతో మందలించాడు. పెళ్ళీడుకొచ్చిన కుమార్తెలు ఉంటే ఈ పనులు ఏంటంటూ ప్రశ్నించాడు. దీంతో భర్త హత్యకే స్కెచ్ వేసింది భార్య.
 
ప్రియుడితో కలిసి నిన్న రాత్రి నిద్రపోతున్న అప్పారావును దారుణంగా హత్య చేసింది. దోపిడీ దొంగల పనేనని కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి దర్యాప్తు జరిపితే అసలు విషయం బయటపడింది. ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments