Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్సార్ బ్రాండ్ లేకపోతే ఒక్క ఓటు రాదు: షర్మిలకు శైలజ కౌంటర్

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (14:45 IST)
కాంగ్రెస్ దివంగత సీఎం వైఎస్సార్ పేరును ఒక బ్రాండ్‌లా అంద‌రూ వాడేస్తున్నార‌ని కాంగ్రెస్ నేత, ఏపీ సీసీ అధ్య‌క్షుడు  శైలజానాథ్ ఆరోపించారు. వై.ఎస్.ఆర్. పేరు పేరు వాడుకోకుండా ప్రజలకు ఏం చేశారో చెప్పాల‌న్నారు. కొత్త పార్టీలు పెట్టేవారు రాజశేఖరరెడ్డి పేరు వాడుకోకుండా ఒక్క ఓటు తెచ్చుకునే దమ్ము లేదని ఎద్దేవా చేసారు.
 
పార్టీలు పెడుతున్నవారు ప్రజలకు ఏం చేశారో చెప్పి వస్తే బాగుంటుందని ష‌ర్మిల‌కు చుర‌క వేశారు.
ప్రాణ త్యాగాలు చేసి తెచ్చుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ని కేంద్రం అమ్ముతుంటే, జగన్ నోరు విప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజల్ని దోచుకుంటున్నాయ‌ని ఆరోపించారు. వంద రూపాయలు డీజిల్ రేటు చేసిన ఘనత మోదీదని అన్నారు.
 
మోదీ ఆర్థిక మిత్రులకు నష్టం వస్తుందని పెట్రోల్, డీజిల్‌ని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం లేదని ఆయన విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తక్షణమే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
అర శాతం అప్పు కోసం, సీఎం జగన్ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని మోదీ దగ్గర కుదవపెడుతున్నారని ఆరోపించారు. ఏ ప్రాంతానికైనా నీళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. వివాదాలు సృష్టించుకుని, రెండు రాష్ట్రాల సీఎంలు రాజకీయాలు చేస్తున్నారని శైలజానాథ్ విమర్శించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments