Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్ సీఈవోగా విజయవాడ అమ్మాయి పద్మశ్రీ వారియర్...? నేడే ప్రకటన

Webdunia
శుక్రవారం, 4 సెప్టెంబరు 2015 (12:42 IST)
ప్రపంచ సాంకేతిక రంగాల్లో తెలుగువారు ఉన్నత స్థానాలను అధిరోహించి తెలుగువాడి సత్తా ఏమిటో నిరూపిస్తున్నారు. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సీఈవోగా అనంతపురం జిల్లాకు చెందిన సత్య నాదెళ్ల ఎంపికై సంచలనం సృష్టించగా మరో తెలుగమ్మాయి ఇలాంటి సంచలనాన్ని సృష్టించనుందనే సమాచారం వస్తోంది. సోషల్ మీడియాలో కీలకమైనది ట్విట్టర్ అని అందరికీ తెలిసిందే. ఇపుడా ఆ ట్విట్టర్‌కు సీఈవోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడకు చెందిన పద్మశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 
కాగా మొన్నటివరకూ ట్విట్టర్ సీఈవోగా కొనసాగిన డిక్కాస్టలో రాజీనామా చేశారు. దీనితో ఈ పదవిలో ఎవరిని నియమించాలన్న దానిపై సంస్థ ఆరుగురు పేర్లను పరిశీలించగా, ఈ లిస్టులో పద్మశ్రీ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఈ పదవికి పోటీ తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. ఐతే యాజమాన్యం పద్మశ్రీ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో జన్మించిన పద్మశ్రీ విజయవాడలోని మాంటిసోరిస్ స్కూల్‌లో పదో తరగతి వరకు చదివారు. ఆ తర్వాత స్టెల్లా కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. పద్మశ్రీ గత 20 ఏళ్లుగా అమెరికాలో స్థిరపడి పలు కంపెనీల్లో కీలక పదవులు నిర్వహించారు. కాగా ట్విట్టర్ సీఈవో ఎవరన్నది ఇవాళ ప్రకటించనున్నారు.

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

బెల్లం టీ తాగండి.. పొట్ట చుట్టూ కొవ్వును ఇట్టే కరిగించుకోండి..

కిడ్నీలను ఆరోగ్యంగా వుంచుకునే ఆహారం.. ఖాళీ కడుపుతో వెల్లుల్లి..

Show comments