Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం గారూ.. మా గోడు వినండి... లేకుంటే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు...

Webdunia
గురువారం, 3 ఫిబ్రవరి 2022 (13:24 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు గురువారం చేపట్టిన ఛలో విజయవాడ కార్యక్రమం విజయంతమైందని చెప్పొచ్చు. బుధవారం ఉదయం నుంచి పోలీసులు తీసుకున్న అనేక చర్యలు, విధించిన ఆంక్షలను ఛేదించుకుంటూ వేలాది మంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఈ ఛలో విజయవాడ కార్యక్రమానికి తరలివచ్చారు. దీంతో విజయవాడ నగరం జన సందోహంగా మారిపోయింది. మా గోడు వినండి ముఖ్యమంత్రి గారూ అంటూ వారు నినాదాలు చేశారు. 
 
ఈ సందర్భంగా వారు ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక కూడా చేశారు. పిల్లలకు పాఠాలే కాదు.. ప్రభుత్వానికి గుణపాఠం కూడా చెపుతామంటూ హెచ్చరించారు. ఏపీ ఎన్జీవో భవన్ నుంచి వేలాది మంది ఉద్యోగులు బీఆర్టీఎస్ రోడ్డు వైపు కదం తొక్కారు. న్యాయబద్ధమైన తమ హక్కులను కాలరాయొద్దంటూ వారు విజ్ఞప్తి చేశారు. ఉప్పెనలా వచ్చిన ఉద్యోగులను పోలీసులు అడ్డుకోలేక చేతులెత్తేశారు. 
 
అదేసమయంలో ప్రభుత్వ తీరును మహిళా ఉద్యోగుల సైతం తీవ్రంగా తప్పుబడుతున్నారు. సలహాదారుల మాట వినకుండా, తమ గోడు వినాలని వారు పాటల రూపంలో ముఖ్యమంత్రికి విన్నవించారు. ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు తమ ఉద్యమం ఆగదని వారు తేల్చి చెప్పారు. పిల్లలకు పాఠాలు చెబుతాం.. ప్రభుత్వానికి గుణపాఠం చెబుతామంటూ హెచ్చరించారు. తమ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు తీవ్రవాదుల కంటే దారుణంగా ఉందని వారు అక్రోషించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈడీ విచారణకు హాజరైన ఏస్ ప్రొడ్యూసర్.. వివరణ ఇచ్చిన అల్లు అరవింద్

Prabhas: ఆదిపురుష్ తో ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడా? ఎవరైనా వేయించారా?

666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ చిత్రం నుండి డాలీ ధనుంజయ్ లుక్

కిరీటి రెడ్డి, శ్రీలీల పై జూనియర్ చిత్రంలో వయ్యారి సాంగ్ చిత్రీకరణ

Rana: రానా దగ్గుబాటి సమర్పణలో కొత్తపల్లిలో ఒకప్పుడు టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments