Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమికుడి కోసం కట్టుకున్న భర్తను దూరం చేసుకుంది.. చివరికి?

ప్రేమికుడి కోసం ఓ మహిళ భర్తను చంపించింది. ప్రియుడి మోజులో పడి.. భర్తను దూరం చేసుకుంది. చివరికి పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన తాడిపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రిలోని కుమ్మర వీధిక

Webdunia
శనివారం, 23 సెప్టెంబరు 2017 (13:52 IST)
ప్రేమికుడి కోసం ఓ మహిళ భర్తను చంపించింది. ప్రియుడి మోజులో పడి.. భర్తను దూరం చేసుకుంది. చివరికి పోలీసులకు దొరికిపోయింది. ఈ ఘటన తాడిపత్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రిలోని కుమ్మర వీధికి చెందిన సుధాకర్‌ను కట్టుకున్న భార్య వెంకటేశ్వరి తన ప్రియుడు, కిరాయి హంతకుడితో కలిసి హతమార్చింది.

ప్యాపిలికి చెందిన వెంకటేశ్వరికి పదో తరగతి నుంచే రాజేశ్ అనే వ్యక్తితో పరిచయం వుంది. వీరిద్దరూ ప్రేమికులు. అయితే వెంకటేశ్వరి రాజేశ్ కంటే చిన్నవాడు కావడంతో పెద్దలు సమ్మతించలేదు. 
 
అనంతరం వైటీ చెరువుకు చెందిన సుధాకర్‌తో వెంకటేశ్వరి వివాహం చేశారు. పెళ్లి తర్వాత వీరు గుత్తి పట్టణంలోని కురబవధికి మకాం మార్చారు. వీరికి బాలుడు కలిగాడు. వివాహానంతరం రాజేశ్‌తో వెంకటేశ్వరి సంబంధం కొనసాగిస్తుండేది. ఈ విషయం తెలుసుకున్న భర్త భార్యను మందలించాడు. అంతే భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. అతనిని హత్య చేసేందుకు పక్కా ప్లాన్ వేసింది. 
 
కర్నూలుకు చెందిన కిరాయి హంతకుడు శివకుమార్‌తో కలిసి భర్తను హతమార్చింది. ఈ నెల 16 రాత్రి నిద్రపోతున్న భర్తపై వెంకటేశ్వరి.. రాజేశ్, కిరాయి కలిపి హతమార్చారు. అది దొంగల పనిగా నమ్మించేందుకు ఇంట్లో ఉన్న 15 తులాల బంగారు నగలు, రూ.19 వేల నగదును ప్రియుడు రాజేశ్‌కిచ్చి వెంకటేశ్వరి పంపించేసింది. అనుమానం రాకుండా తనను కట్టేసి, వెళ్లమని చెప్పింది. తరువాత దొంగలు పడ్డారని అరిచింది. 
 
తన భర్తను హత్య చేసి, రూ.5 లక్షల నగదు, 30 తులాల బంగారు దొంగలు ఎత్తుకెళ్లారంటూ వెంకటేశ్వరి పేర్కొనడం పట్టణంలో సంచలనం రేపింది. అయితే పోలీసులు జరిపిన విచారణలో వెంకటేశ్వరి అసలు ముద్దాయి అంటూ తేలింది. దీంతో వెంకటేశ్వరి, రాజేశ్, శివకుమార్ అరెస్టయ్యారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments