పాపం మాజీ మునిసిపల్ చైర్మన్ శ్రీదేవి... పురుగుమందు తాగి ప్రాణం తీసుకుంది... ఏం జరిగింది?
ఎన్నో కష్టాలు, అవమానాలు భరిస్తున్నానని చెపుతూ ఉండే మాచర్ల మాజీ మునిసిపల్ చైర్మన్ శ్రీదేవి శుక్రవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. పురుగుల మందు తాగిందని తెలుసుకున్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె ప్రాణాల
ఎన్నో కష్టాలు, అవమానాలు భరిస్తున్నానని చెపుతూ ఉండే మాచర్ల మాజీ మునిసిపల్ చైర్మన్ శ్రీదేవి శుక్రవారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. పురుగుల మందు తాగిందని తెలుసుకున్న స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆమె ప్రాణాలను కోల్పోయింది. కాగా నాలుగు నెలల క్రితం శ్రీదేవి తన పదవికి రాజీనామా చేశారు.
సాధారణంగా ఈ రోజుల్లో అధికార పదవి రావడం కష్టం. మహిళలకు అయితే అది మరీ కష్టం. కానీ, వచ్చిన పదవిని నాకొద్దని రాజీనామా లేఖ రాసిచ్చారు అప్పట్లో శ్రీదేవి. గుంటూరు జిల్లా మాచర్ల మునిసిపల్ చైర్పర్సన్ శ్రీదేవి రాజీనామా అప్పుడు చర్చనీయాంశంగా మారింది.
2014 ఎన్నికల్లో శ్రీదేవి టీడీపీ అభ్యర్థినిగా 15వ వార్డు నుంచి గెలుపొందారు. ఆమె భర్త మల్లిఖార్జునరావు తెదేపాకు చెందిన కొంతమంది పెద్దల ఒత్తిడి కారణంగా గుండెపోటుతో మరణించినట్లు శ్రీదేవి అప్పట్లో చెప్పారు. అనంతరం కొద్దిరోజులకే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. తాను వ్యక్తిగత కారణాల వల్ల తన ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నానని శ్రీదేవి లేఖ రాశారు.