Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్జీవీ సినిమా టిక్కెట్లపై ఆ ట్వీట్ ఎందుకు చేశారు?

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (14:25 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంతో సినిమా టిక్కెట్ల‌పై చ‌ర్చ చేసిన మ‌రుస‌టి రోజే ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రో ట్వీట్ చేశారు. కట్ట‌ప్ప‌ను చంపింది ఎవ‌రు అంటూ...సెటైర్ వేశారు. అయితే, ఈ ట్వీట్ ఆయ‌న టిక్కెట్ల ధ‌ర‌ల త‌గ్గింపు అంశాన్ని పూర్తిగా త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు చేశార‌ని ప‌రిశ్ర‌మ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, ఆయ‌న తాను ప‌రిశ్ర‌మ ప్ర‌తినిధిగా రాలేద‌ని అంటూనే, మంత్రి పేర్ని నానితో చ‌ర్చ‌లు జ‌రిపి, హైద‌రాబాదుకు తిరుగుపయ‌నం అయ్యారు. తిరిగి వేరే రాష్ట్రంలో ఆర్.ఆర్.ఆర్.కి టిక్కెట్ భారీగా పెంచి అమ్ముకునేందుకు వెసులుబాటు క‌ల్పించారంటూ ట్వీట్ చేశారు. అంటే, ఈ సినిమా టిక్క‌ట్ల వ్య‌వ‌హారాన్ని ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌కు కాక తగిలేవ‌ర‌కు లైవ్ లో ఉంచ‌డం వ‌ర్మ టెక్నిక్ గా భావిస్తున్నారు.
 
 
సినిమా టికెట్ల విషయంలో నిన్న రాష్ట్ర మంత్రి పేర్ని నానితో భేటీ అయిన వర్మ, నేడు ఇలా ట్వీట్‌ చేశారు. టికెట్ల ధరల గురించి ప్రశ్నించే వారికి కోసం అంటూ ఈ సెటైర్ వేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఐనాక్స్‌ ఇన్‌సిగ్నియా మల్టిప్లెక్స్‌  సినిమా టికెట్‌ను రూ.2,200లకు అమ్ముతోంది. రాజమౌళి తీసిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా టికెట్‌ను రూ. 2200లకు అమ్మేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రం రూ. 200లకు అమ్మడానికి కూడా అనుమతించడం లేదు. దీంతో అసలు కట్టప్పను చంపిందెవరు? అని  ట్వీట్‌ చేశారు. అంటే పరిశ్రమను చంపుతోంది ఎవరు అని ఆర్జీవీ ప్రశ్నను సంధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments