తెలుగు రాష్ట్రాలకు అతి ముఖ్యమైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో దొంగలు పడ్డారా? అవుననే చెబుతోంది కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు. ఈ రెండు ప్రాజెక్టులలలో ఊహించిన దానికంటే 6.1 టీఎంసీల నీ
తెలుగు రాష్ట్రాలకు అతి ముఖ్యమైన శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో దొంగలు పడ్డారా? అవుననే చెబుతోంది కృష్ణా రివర్ వాటర్ మేనేజ్మెంట్ బోర్డు. ఈ రెండు ప్రాజెక్టులలలో ఊహించిన దానికంటే 6.1 టీఎంసీల నీళ్లు తక్కువగా ఉన్నట్లు తేలటంతో ఇదెవరి పనంటూ కృష్ణా వాటర్ బోర్డు తలపట్టుకుంటోంది. బోర్డు అధికారులు చెబుతున్న దాని ప్రకారం 2016 నవంబర్ 29 నాటికి ఈ రెండు ప్రాజెక్టుల్లో 129.96 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. జనవరి 10 వరకు రెండు తెలుగు రాష్ట్రాలు 59.324 టీఎంసీల నీళ్లను ఉపయోగించుకున్నాయి.
తాను 39.756 టీఎంసీల నీళ్లను వాడుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాచారం ఇవ్వగా, 19.568 టీఎంసీల నీటిని తాను వాడుకున్నానని తెలంగాణ పేర్కొంది. ఈ రెండు రాష్ట్రాలు ఇంత పరిమాణంలో నీటిని వాడుకున్న తర్వాత ఈ రెండు రిజర్వాయర్లలో 70.636 టీఎంసీల నీళ్లుండాలి. కానీ వాస్తవానికి ఇప్పుడు 64.530 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నట్లు బయటపడింది. అంటే 6.106 టీఎంసీల నీళ్లు లేవు. అసలు సమస్యల్లా ఇక్కడే ఉంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రెండింటిలో ఏదో ఒక రాష్ట్రం అదనపు నీటిని వాడుకుని చెప్పకుండా దాచిపెడుతున్నట్లు ప్రస్తుతం కృష్ణా రివర్ వాటర్ యాజమాన్య మండలి అనుమానపుడుతోంది. లెక్క చెప్పకుండా ఇంత భారీస్థాయిలో నీటిని కొల్లగొట్టిన దొంగ ఎవరో కనుక్కోవడానికి కృష్ణా బోర్డు ఆపసోపాలు పడుతోంది. తలనొప్పి కల్గించే ఇలాంటి సమస్యలు తరచు ఎదురవుతుండంతో కృష్ణా బోర్డు వాస్తవంగా నీటి ఉపయోగాన్ని ఖచ్చితంగా తెలిపే టెలిమెట్రీ పరికరాలను ఉపయోగించాలంటూ ప్రతిపాదన చేసింది కూడా.
ఇంతకూ కృష్ణా వాటర్ బోర్డుకు కూడా తెలియనంత నైపుణ్యంగా రిజర్వాయర్లోని నీటిని ఎవరు దొంగిలించి ఉంటారబ్బా..!