Webdunia - Bharat's app for daily news and videos

Install App

యుద్ధాన్ని గెలవడానికి జగన్‌కు బలాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నా: ఉండవల్లి

Webdunia
గురువారం, 30 జులై 2020 (17:08 IST)
సీనియర్ రాజకీయ నేత, న్యాయకోవిదుడు, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ముఖ్యమంత్రి పట్ల నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఆయనకు సూచనలు చేస్తున్నట్లుగా లేఖ రాస్తూనే తనదైన శైలిలో చురకలంటించారు.

ప్రైవేట్ ఆస్పత్రులను కూడా కొవిడ్ పరీక్షలకు అనుమతించి ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం నిర్ణయించాలన్నారు. ప్రస్తుతం పేద, దిగువ మధ్య తరగతి ప్రజలు డబ్బు లేదా పలుకుబడి ఉంటే తప్ప కరోనా బారినపడి జీవించలేమని ఆవేదన చెందుతున్నారని తెలిపారు. 

కోవిడ్ రోగులకు తాత్కాలిక సహాయ కేంద్రాలు నడిపేందుకు ఫంక్షన్ హాళ్లను స్వాధీనం చేసుకుని ఎన్జీవోలు, ట్రస్టులకు అప్పగించాలని కోరారు. కోవిడ్ సహాయ కేంద్రాల నిర్వహణ ఖర్చును ఎన్జీవోలు, ట్రస్టులు భరిస్తాయని, ప్రభుత్వం నుంచి డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందిని అందించాలన్నారు.

రాజమండ్రిలో జైన్ సంఘం ఇప్పటికే అద్దెకు కళ్యాణ మండపం తీసుకొని 60 పడకలతో కరోనా సెంటర్‌ను నడుపుతోందని లేఖలో ఉండవల్లి అరుణ్‌కుమార్ తెలిపారు. కొవిడ్‌కు వ్యతిరేకంగా యుద్ధాన్ని గెలవడానికి సీఎం జగన్‌కు బలాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నానని ఉండవల్లి చెప్పారు.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments