మహిళలకు రక్షణ ఏది?... లోకేష్ ట్వీట్

Webdunia
సోమవారం, 28 అక్టోబరు 2019 (15:12 IST)
ఎన్నికల సమయంలో అమ్మా, అక్కా అంటో ఓట్లు దండుకుని ఇప్పుడు వారి భద్రతకు తిలోదాలిచ్చారంటూ జగన్ పై టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు.

‘అనంతపురం జిల్లా ఈదులబలపురంలో ఒక మహిళ భర్తను బంధించి, మీ నాయకుడొకరు ఆమెపై అత్యాచారం చేయబోయిన ఘటన అత్యంత ఘోరం. ఈ అభాగ్యురాలు చేసిన పాపమేంటి? ఎన్నికలప్పుడు అమ్మా, అక్కా, చెల్లీ అని ఓట్లు అడిగారు కదా జగన్ గారూ. ఇప్పుడు వాళ్లకి భద్రత కరవయింది, దీనికేం సమాధానం చెబుతారు?’ అని ట్వీట్ చేశారు.

ఆ మహిళ మీడియాకు వివరాలు తెలిపిన వీడియోను పోస్ట్ చేశారు. ఆ వీడియోతో .. సోమందేపల్లి మండలం ఈదుల బలపురం గ్రామంలో వైసీపీ నాయకుడు ఒకరు తనను వేధిస్తున్నాడని ఓ వివాహిత ఆరోపణలు చేసింది. తన కోరిక తీర్చాలంటూ తనను  ఇబ్బందులకు గురిచేస్తున్నాడని తెలిపింది.

తన భర్తను బంధించి తనపై అత్యాచారం చేయబోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు వైసీపీ నేతను  అరెస్ట్ చేసి, శిక్షించాలని పేర్కొంది.  దీనిపై ప్రభుత్వం తరుపున ఎవరూ స్పందించడం లేదని లోకేష్ మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ ఫైర్ బ్రాండ్.. దివ్వెల మాధురి ఎలిమినేషన్.. రెమ్యూనరేషన్ భారీగా తీసుకుందా?

Ashika Ranganath :స్పెషల్ సెట్ లో రవితేజ, ఆషికా రంగనాథ్ పై సాంగ్ షూటింగ్

SSMB29: రాజమౌళి, మహేష్ బాబు సినిమా అప్ డేట్ రాబోతుందా?

Shyamala Devi : గుమ్మడి నర్సయ్య దర్శకుడిని ప్రశంసించిన శ్యామలా దేవీ

NBK 111: బాలక్రిష్ణ నటిస్తున్న ఎన్.బి.కె. 111 చిత్రం నవంబర్ 7న ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

తర్వాతి కథనం
Show comments