Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుస్తెలమ్మైనా పులస తినాలన్నది నానుడి.. రూ.వేలు పలికిన గోదారి పులస! (video)

Webdunia
సోమవారం, 21 సెప్టెంబరు 2020 (10:45 IST)
పుస్తెలమ్మైనా పులస తినాలన్న నానుడి వాడుకలో ఉంది. ముఖ్యంగా గోదారి పులసకు ఉండే ప్రత్యేకత ఇంతాఇంతా కాదు. అంటే.. గోదారి పులస రుచి అలాంటిది మరి. అయితే, ఈ పులస రుచిలాగానే ధర కూడా ఉంటుంది. పులసలకు పెట్టింది పేరు... తూర్పు'గోదావరే'! 
 
జూలై - సెప్టెంబరు నెలల మధ్య వర్షాకాలంలో.. 'ఇలస' చేప.. గోదావరి జలాల్లో ఎదురీదుతూ.. 'పులస'గా మారుతుందని చెబుతారు. మత్స్యకారుల వలకు చాలా అరుదుగా పడతాయి. కిలో రూ.4 వేల వరకు ఉంటుంది. దేశంలోనే ఖరీదైన చేప అంటారు. దీని రుచి గురించి తెలిసినవారు.. ధర గురించి ఏమాత్రం ఆలోచించరు.
 
తాజాగా.. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పాశర్లపూడి వద్ద గోదావరి నదిలో ఆదివారం స్థానిక మత్స్యకారుడి వలలో రెండున్నర కిలోల పులస చేప పడింది. పాశర్లపూడిలో నగరం ఏఎంసీ ఛైర్మన్‌ కొమ్ముల కొండలరావు ఈ చేపను రూ.21 వేలుకు కొనుగోలు చేయడం విశేషం. 
 
పులస సాధారణంగా 3 కిలోలకు మించి బరువుండదు. ఎక్కువగా అరకిలో, కిలో లోపు చేపలే దొరుకుతాయి. కానీ ఈ పులస ఏకంగా రెండున్నర కిలోలు ఉండటంతో ధర కూడా ఓ రేంజ్‌లోనే పలికిందన్నమాట. అద్గదీ గోదారి పులస కథ. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments