అమరావతిని మున్సిపాలిటీగా చేస్తారా? సర్కారు ఉద్దేశం ఏంటి? గ్రామస్తులు

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2022 (12:06 IST)
అమరావతిని మున్సిపాలిటీగా చేయడం వెనుక వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి గల ఉద్దేశం ఏంటో చెప్పాలని గ్రామ సభల్లో అధికారులను ప్రజలు నిలదీశారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ అమరావతిని మున్సిపాలిటీగా ఏర్పాటు చేసేందుకు అంగీకరించబోమని తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి గ్రామసభలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. 
 
అమరావతి మున్సిపాలిటి ఏర్పాటు ప్రతిపాదనపై మంగళగరి మండలం, కృష్ణాయపాలెం, తుళ్లూరు మండలం మల్కాపురం, వెలగపూడి, పెదపెరిగి గ్రామాల్లో శుక్రవారం అధికారులు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. ఇందులో భాగంగా రాజధానిలో లేని గ్రామాలను మున్సిపాలిటీలోకి ఎందుకు తేవాలనుకుంటున్నారు.. అని ప్రశ్నించారు. 
 
మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ కొన్ని గ్రామాలను కలిపి రాజధాని గ్రామాలను ముక్కచెక్కలుగా చేసేందుకు ప్రభుత్వం అమరావతి మున్సిపాలిటీ ప్రతిపాదనను తెరమీదకు తెచ్చిందని మండిపడ్డారు. 
 
అమరావతిని రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అమరావతిని మున్సిపాలిటీగా చేసేందుకు అంగీకరించమని.. 12 అంశాలతో కూడిన అభ్యంతర పత్రాలను అధికారులకు ఈ సందర్భంగా గ్రామస్థులు అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sai Pallavi: పూజా హెగ్డేకు బ్యాడ్ లక్.. సాయిపల్లవికి ఆ ఛాన్స్..

Prabhas: ప్రభాస్ రాజా సాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ అప్డేట్

వీధికుక్కలు దేశంలో ఎవరిని కరిచినా నన్నే నిందిస్తున్నారు : అక్కినేని అమల

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments