Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాణాలు తీస్తున్న ఆంధ్రా రోడ్లు - గుంతలో పడి బైకర్ మృతి

Webdunia
గురువారం, 28 జులై 2022 (15:41 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని రహదారులు అత్యంత దయనీయంగా ఉన్నాయి. ఈ రోడ్లు ఇప్పటికే అనేక మంది ప్రాణాలను హరించాయి. తాజాగా వెస్ట్ గోదావరి జిల్లాలో ఓ బైకర్ మృత్యువాతపడ్డారు. మరో వారం రోజుల్లో సౌతాఫ్రికాకు వెళ్లాల్సిన ప్రవీణ్... బుధవారం రాత్రి అత్తిలి నుంచి తాడేపల్లిగూడెం వెళుతుండగా రోడ్డుపై ఉన్న గంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, అత్తిలికి చెందిన ప్రవీణ్ కుమార్ దక్షిణాఫ్రికాలో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. నాలుగు నెలల క్రితం సౌతాఫ్రికా నుంచి స్వగ్రామానికి వచ్చాడు. మరో వారం రోజుల్లో మళ్లీ ఆయన సౌతాఫ్రికాకు వెళ్లాల్సివుంది. 
 
బుధవారం రాత్రి ఒక పనిమీద అత్తిలి నుంచి తాడేపల్లిగూడెంకు బైక్‌పై ప్రవీణ్ బయలుదేరాడు.  అయితే, రావిగుంట వద్ద రోడ్డుపై గోతులు కనిపించక వేగంగా అలాగే, ముందుకు వెళ్ళాడు. బైక్ గొయ్యిలోకి వెళ్లి అదుపుతప్పింది. ఈ ఘటనలో ఆయన బైక్‌పై నుంచి ఎగిరిపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం తగలగడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడు మృతితో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

త్రిబాణధారి బార్బరిక్ లో ఉదయ భాను స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments